rain: తెలంగాణలో అకాల వర్షాలకు 9 మంది మృతి.. మరో 5 రోజులు వర్షాలు పడే అవకాశం

  • మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం
  • పలు చోట్ల పిడుగులు పడే అవకాశం
  • రేపు, ఎల్లుండి భారీ వర్షాలు  

తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వర్షాలపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. వర్షాల వల్ల రాష్ట్రంలో మొత్తం 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. మృతులు వరంగల్ గ్రామీణం, భూపాలపల్లి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకు చెందిన వారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. మరో 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News