keerthi suresh: సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి' .. అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి

  • సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' 
  • ప్రధానపాత్రలో కీర్తి సురేశ్ 
  • ఈ నెల 9వ తేదీన భారీ రిలీజ్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' పేరుతో సావిత్రి జీవిత కథ రూపొందింది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో దర్శకనిర్మాతలు వున్నారు. సమంత .. షాలినీ పాండే .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ వంటి యువ నటీనటులు, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు నటించడం ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది. ఈ సినిమా కీర్తి సురేశ్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా తమిళ వెర్షన్ 'నడిగర తిలగమ్'ను మే 11వ తేదీన విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News