sukumar: సుకుమార్ కి అడ్వాన్స్ గా 6 కోట్లు ముట్టాయట!

  • 'రంగస్థలం'తో హిట్ కొట్టిన సుకుమార్ 
  • పోటీపడుతోన్న నిర్మాతలు 
  • తదుపరి సినిమా మహేశ్ బాబుతో  

కథాకథనాలను కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా చెప్పడం సుకుమార్ ప్రత్యేకత. 'రంగస్థలం' వంటి భారీ విజయాన్ని అందుకున్న ఆయనకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారికే ముందుగా సుకుమార్ సినిమా చేసి పెట్టనున్నాడు .. అదీ మహేశ్ బాబు హీరోగా.

 ఈ సినిమా కోసం అడ్వాన్స్ గా ఆయనకి ఇప్పటికే 6 కోట్లు ముట్టాయనే టాక్ వినిపిస్తోంది. అడ్వాన్స్ రూపంలో ఇంత పెద్దమొత్తం అందుకున్న అతికొద్దిమంది దర్శకులలో సుకుమార్ ఒకరని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వంశీ పైడిపల్లితో తన 25వ సినిమా చేసిన తరువాత, 26వ సినిమా కోసం సుకుమార్ తో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.   

  • Loading...

More Telugu News