malla reddy: ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీ కొని వ్యక్తికి గాయాలు

  • హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఘటన
  • ఉప్పల్‌ నుంచి వచ్చిన కేటీఆర్‌ కాన్వాయ్‌
  • మల్లారెడ్డి వాహనం ఢీ కొన్న వ్యక్తి ఆసుపత్రికి తరలింపు 

హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పల్‌ నుంచి రామాంతపూర్‌ వైపుగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అందులోని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయాలపాలైన వ్యక్తిని వెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి గురించి సమాచారం అందాల్సి ఉంది.                

malla reddy
Road Accident
Hyderabad
  • Loading...

More Telugu News