Road Accident: కడప జిల్లాలో లారీ-తూఫాన్‌ వాహనం ఢీ.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

  • పుల్లంపేటలో ప్రమాదం
  • బంధువుల వివాహానికి వెళుతుండగా ఘటన
  • అనంతపురం జిల్లా గుంతకల్లు వాసులుగా గుర్తింపు 

లారీ-తూఫాన్‌ వాహనం ఢీకొని ఏడుగురు మృతి చెందిన ఘోర ప్రమాద ఘటన కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం వారంతా గుంతకల్లు నుంచి తిరుపతిలో బంధువుల వివాహానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో గాయాలపాలయిన వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మహిళలు, చిన్నారి ఉన్నారని, బాధితులంతా అనంతపురం జిల్లా గుంతకల్లు వీరప్పగుడి ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News