Balakrishna: మోదీని బాలకృష్ణతో తిట్టించారు: చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్‌

  • బాలయ్యపై ఒక్క కేసు కూడా పెట్టలేదు
  • ముఖ్యమంత్రి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
  • చంద్రబాబుది నాలుక కాదు తాటిమట్ట
  • రాష్ట్రంలో బీజేపీకి గడ్డు పరిస్థితి లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారం విపరీతంగా జరుగుతోందని బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని అన్నారు. తమ పార్టీకి ఏపీలో గడ్డు పరిస్థితి ఉందని, టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, గడ్డు పరిస్థితులు లేవు, గుడ్‌ పరిస్థితులు ఉన్నాయని సోము వీర్రాజు చమత్కరించారు.

న్యాయం బీజేపీ, మోదీల వెనుక ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు.. మోదీని బాలకృష్ణతో తిట్టించారని, బాలయ్యపై ఒక్క కేసు కూడా పెట్టలేదని అన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం తనపై పలు కేసులు పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. చంద్రబాబుది నాలుక కాదని, తాటిమట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News