Gali Muddu Krishnama Naidu: గాలి సరస్వతమ్మకు టికెట్ ఖారారు చేసిన చంద్రబాబు

  • చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టికెట్ ఖరారు
  • గాలి సతీమణి సరస్వతమ్మకు టికెట్
  • టికెట్ కోసం పోటీ పడ్డ గాలి కుమారులు

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. గాలి సతీమణి గాలి సరస్వతమ్మకు టికెట్ ఖరారైంది. ఈ ఉదయం చంద్రబాబును సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ టికెట్ ను సరస్వతమ్మకు కేటాయించినట్టు వారికి చెప్పారు. వాస్తవానికి ఈ టికెట్ కోసం గాలి కుమారులు ఇద్దరూ పోటీ పడ్డారు. దీంతో, మధ్యే మార్గంగా సరస్వతమ్మకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. సరస్వతమ్మకు టికెట్ కేటాయింపుపై గాలి కుటుంబంలో కూడా ఏకాభిప్రాయం ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Gali Muddu Krishnama Naidu
gali saraswathamma
mlc
ticket
Chittoor District
Chandrababu
  • Loading...

More Telugu News