nagarjuna: మాఫియా నేపథ్యంలో 'ఆఫీసర్' .. ఈ రోజుతో షూటింగ్ పూర్తి

  • నాగ్ హీరోగా 'ఆఫీసర్'
  • కథానాయికగా మైరా సరీన్ 
  • వచ్చేనెలలో విడుదల

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'ఆఫీసర్' సినిమా రూపొందుతోంది. ముంబై మాఫియా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో కథానాయికగా మైరా సరీన్ నటిస్తోంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఈ రోజుతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది.

వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో ముంబై వెళతాడు. అక్కడ అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివి? వాటిని ఆయన ఎలా అధిగమించాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందట. ఇది 'శివ' సినిమాను మించి ఉంటుందని వర్మ చెప్పడం వలన, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.  

  • Loading...

More Telugu News