keerthi suresh: 'మహానటి' నుంచి మరో మధురమైన సాంగ్ రిలీజ్

  • సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల
  • అలరిస్తోన్న మరో సాంగ్  

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి' రూపొందింది. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలెట్టేశారు. అందులో భాగంగా ఇంతకుముందు వదిలిన ఒక లిరికల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ .. కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చే ఆ సాంగ్ ను రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'సదా నన్ను నడిపే నీ చెలిమే' అనే మరో సాంగ్ ను రిలీజ్ చేశారు.

 సమంత .. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ సాంగ్ ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను .. చారులతా  మణి ఆలపించారు. మిక్కి జె. మేయర్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ మనసును సుతారంగా తాకుతూ .. మధురానుభూతిని కలిగిస్తోంది. మొత్తానికి ఈ పాట ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేదిలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

  • Loading...

More Telugu News