Chinthamaneni Prabhakar: బాధితుడి ఇంటికి ఎమ్మెల్యే చింతమనేని.. సమసిన వివాదం!

  • ఆర్టీసీ బస్సుపై ఉన్న పోస్టర్ లో చంద్రబాబు ముఖం చినిగిపోవడంపై చింతమనేని రచ్చ
  •  ఓ స్థానికుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
  • నిన్న బాధితుడి వద్దకు స్వయంగా వెళ్లి రాజీ చేసుకున్న వైనం

ఆర్టీసీ బస్సుపై అతికించిన ప్రభుత్వ పోస్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖం చినిగిపోయిందంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హనుమాన్ జంక్షన్ లో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, మధ్యలో అడ్డుకునేందుకు యత్నించిన స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావుపై చేయి కూడా చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, నిన్న సాయంత్రం హనుమాన్ జంక్షన్ కు వచ్చిన చింతమనేని... కొందరు కాపు నేతలతో కలసి అప్పనవీడులోని బాధితుడు గరికపాటి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అనుకోకుండానే ఆ ఘటన జరిగిపోయిందని, దానిని పెద్దది చేయవద్దని నాగేశ్వరరావును కోరారు. స్వయంగా చింతమనేనే తన వద్దకు రావడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో, వివాదం సమసిపోయింది. 

  • Loading...

More Telugu News