vivekananda reddy: ముగిసిన ఆనం వివేకానంద రెడ్డి అంత్యక్రియలు

  • పెన్నానది ఒడ్డున ఉన్న బోడిగాడి తోట వద్ద అంత్యక్రియలు
  • అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికిన నేతలు
  • తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

ప్రోస్టేట్ కేన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంకాలం నెల్లూరులోని పెన్నానది ఒడ్డున ఉన్న బోడిగాడి తోట వద్ద ముగిశాయి. అశ్రునయనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయనతో గడిపిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.           

  • Loading...

More Telugu News