Congress: ఢిల్లీలో 29న ప్ర‌జా ఆగ్ర‌హ ర్యాలీ: ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి

  • ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ర్యాలీ
  • రామ్ లీలా మైదానంలో ర్యాలీ నిర్వహణ 
  • రైతు ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలపై నిరసన 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 29న ఢిల్లీలో ‘ప్ర‌జా ఆగ్ర‌హ ర్యాలీ’ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జాతీయ ప్రజా ఆగ్రహ ర్యాలీ నిర్వహిస్తున్నామని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ ర్యాలీలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపు నిచ్చారు.

భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలు దోపిడీకి గురైన పాలనలో ఉన్నారని, నిరుద్యోగ పెరుగుదల, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, రైతు ఆత్మహత్యలపై నిరసన తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళా, ఓబీసీ విభాగం, మత్స్యకారుల కాంగ్రెస్, అసంఘటిత వర్కర్స్ కాంగ్రెస్,  వివిధ విభాగాల కాంగ్రెస్ నాయ‌కులు అధిక సంఖ్య‌లో పాల్గొంటార‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News