suddala: నేను పాట రాయలేదు .. అయినా మోహన్ బాబు గారు డబ్బు పంపించారు!: సుద్దాల అశోక్ తేజ

  • మోహన్ బాబు గారు పిలిపించారు 
  • నాతో వరుస పాటలు రాయించారు 
  • నా పాట దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టారు

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ .. తన కెరియర్ తొలినాళ్లను గురించి చెప్పారు. "నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అనుకోకుండానే వరుసగా విప్లవ గీతాలు రాశాను. అలాంటి పరిస్థితుల్లో మోహన్ బాబు గారు ఫోన్ చేసి .. 'నువ్ అన్నీ విప్లవ సినిమాలకే రాస్తే అంతే .. కమర్షియల్ కూడా రాయి' అన్నారు. 'అవకాశం ఇస్తే వేరే పాటలు కూడా రాస్తాను సార్' అన్నాను.

'అయితే రా .. నేను అవకాశం ఇస్తాను' అంటూ నన్ను పిలిపించి పక్కాగా ఒక కమర్షియల్ సాంగ్ ను రాయించారు. ఆ తరువాత కూడా వరుసగా నాతో రాయిస్తూ వచ్చారు. ఒకసారి ఆయన సినిమాకి రాసే ప్రయత్నంలో ఉండగానే నేను బైక్ పై నుంచి పడిపోయి హాస్పిటల్లో చేరాను. వెంటనే మేనేజర్ ను పిలిచి నాకు పాతికవేలు ఇచ్చి రమ్మన్నారట. నేను పాట రాయలేదనే విషయం మేనేజర్ గుర్తు చేయగా, రాయకపోయినా మన ఆస్థాన కవిని కాపాడుకోవలసిన బాధ్యత మనపై వుంది' అని చెప్పేసి ఆ డబ్బు పంపించారు. అలా నా పాట దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడిన మహానుభావుడు మోహన్ బాబు గారు' అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News