Mahesh Babu: 5 రోజుల్లో 'భరత్'కి 76 కోట్ల షేర్!

  • దూసుకుపోతోన్న 'భరత్ అనే నేను'
  • తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల షేర్ 
  • ఒక్క నైజామ్ లోనే 15.3 కోట్ల షేర్  

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'భరత్ అనే నేను' భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో 76 కోట్ల షేర్ ను రాబట్టింది.

 ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా ఈ 5 రోజుల్లో 15.3 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. కథాకథనాలు .. సంగీతం .. మహేశ్ స్టైలిష్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు రావడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను కొల్లగొట్టడం పట్ల మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.   

  • Loading...

More Telugu News