keerthi suresh: 'మహానటి' ఆడియో ఫంక్షన్ కి రంగం సిద్ధం

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' 
  • ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్
  • 1వ తేదీన ఆడియో రిలీజ్  

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' చిత్రం రూపొందింది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, మే 1వ తేదీన ఆడియో ఫంక్షన్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలోని నటీనటులంతా కూడా ఈ పాటల వేడుకకి హాజరుకానున్నారు. ఆడియో వేడుక ఎప్పుడు ఎక్కడ జరపనున్నది ప్రకటించనున్నారు. ఇప్పటికే అచ్చు సావిత్రి మాదిరిగానే ఉందంటూ, కీర్తి సురేశ్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఇక మిగతా ముఖ్యమైన పాత్రల్లో సమంత .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ .. నాగచైతన్య .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. షాలిని పాండే నటించారు. సావిత్రి అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.    

  • Loading...

More Telugu News