trivikram: త్రివిక్రమ్ తో మహేశ్ మూవీ డౌటే .. లైన్లో సందీప్ రెడ్డి ప్రాజెక్ట్

  • 'భరత్ అనే నేను'తో హిట్ కొట్టిన మహేశ్ 
  • తదుపరి సినిమా వంశీ పైడిపల్లితో 
  • ఆ తరువాత సినిమా సందీప్ రెడ్డి వంగతో    

మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈలోగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తన సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ .. మహేశ్ కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ ఈ ఇద్దరూ కలిసి ఇప్పట్లో ఒక సినిమా చేయడం కష్టమేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో మహేశ్ తో కలిసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కనిపించడమే అందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ వినిపించిన కథ మహేశ్ కి నచ్చేయడం .. ఈ సినిమాను నిర్మించడానికి మైత్రీ మూవీస్ వారు ముందుకు రావడం జరిగిపోయింది. అందువలన దాదాపు ఈ కాంబినేషన్ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ హిట్ కొడితే మహేశ్ మనసు మారవచ్చనీ .. అప్పుడు వచ్చేఏడాది వాళ్ల కాంబినేషన్లో సినిమా ఉండొచ్చుగానీ, ఈ ఏడాది మాత్రం డౌటేనని అంటున్నారు.         

  • Loading...

More Telugu News