Mahesh Babu: మహేశ్ బాబు ఫ్రెండ్ గా కామెడీ హీరో ఖరారైపోయాడు

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు 
  • ఆయన కెరియర్లో 25వ సినిమా
  • కథానాయికగా పూజా హెగ్డే      

ప్రస్తుతం మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత లభించిన విజయాన్ని అభిమానులతో ఆయన షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. మహేశ్ ఫ్రెండ్ పాత్రకి అల్లరి నరేశ్ ను అనుకుంటున్నారనే టాక్ వినిపించింది. ఆయనను తీసుకున్నారనేది తాజా సమాచారం. మహేశ్ తో పాటు సినిమా అంతా కనిపించే పాత్ర ఇది. ఈ పాత్రలోని కొత్తదనం కారణంగానే అల్లరి నరేశ్ అంగీకరించాడని అంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చెబుతున్నారు.    

  • Loading...

More Telugu News