TRS: ఎన్నికలకు ముందు ఈ ప్లీనరీ అత్యంత కీలకం.. దేశ రాజకీయాలపై కేసీఆర్‌ చర్చిస్తారు: కేటీఆర్‌

  • ఈ నెల 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ
  • మేడ్చల్‌ జిల్లా కొంపల్లి వేదికగా చర్చలు
  • ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్‌
  • 13 వేల మంది హాజరు

ఎన్నికలకు ముందు జరగబోయే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ అత్యంత కీలకమని, ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చిస్తారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

 ఈ రోజు కొంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ... ఈ ప్లీనరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, దీనికి 13 వేల మంది హాజరుకానున్నారని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్లీనరీకి వచ్చే వారి కోసం అంబలి, మజ్జిగ, నీరు వంటి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, మంచి భోజన సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News