amit shah: అమిత్‌షా, యోగి పాల్గొన్న బహిరంగ సభ వేదిక వద్ద చెలరేగిన మంటలు

  • ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఘటన
  • వెంటనే అదుపులోకి తెచ్చిన కార్యకర్తలు 
  • షాట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు  

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో కలసి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే, వేదికపై ఒకరు ప్రసంగిస్తుండగా అదే సమయంలో మీడియా ఎన్‌క్లోజర్‌ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు మంటలను అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది. షాట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు వ్యాపించాయని సమాచారం.

కాగా, ఈ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కుటుంబ రాజకీయాల నుంచి రాయ్‌బరేలీకి తమ పార్టీ విముక్తి కల్పిస్తుందని, 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలే ఆ నియోజక ఎన్నికల్లో గెలిచారని, అయినప్పటికీ అభివృద్ధి మాత్రం జరగలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము రాయ్‌బరేలీలో గెలిచి గెలిచి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.    

  • Loading...

More Telugu News