mahesh babu: మహేశ్ తో ఓ సినిమా చేయాలనేది నా కల .. అది నిజమైంది!: నిర్మాత డీవీవీ దానయ్య

  • నిర్మాతగా సుదీర్ఘమైన ప్రయాణం చేశాను 
  • మహేశ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను 
  • అది కొరటాల ద్వారా నెరవేరింది

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలోని 'భరత్ అనే నేను' సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ .. "నిర్మాతగా 25 సంవత్సరాలుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను" అని చెప్పారు.

"తాజాగా 'భరత్ అనే నేను' సినిమాను నిర్మించాను. మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలనేది నా కల. ఎప్పటి నుంచో నేను ఆయన చుట్టూ తిరుగుతూ వున్నాను. ఆ కోరిక కొరటాల ద్వారా నెరవేరడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కొరటాల ..మహేశ్ లతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మా బ్యానర్ గర్వపడే సినిమా అవుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News