Hyderabad: అమ్మమ్మ ఇంటికని వెళ్లి రైల్వే స్టేషన్ లో శవమై కనిపించిన హైదరాబాద్ బ్యూటీషియన్ జ్యోతి!

  • లింగంపల్లిలో పనిచేస్తున్న జ్యోతి
  • మైలారం రైల్వే స్టేషన్ లో మృతదేహం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

హైదరాబాదు శివార్లలోని లింగంపల్లిలో బ్యూటీషియన్ గా పని చేస్తున్న జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో విగతజీవురాలై కనిపించగా, కేసును ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన జ్యోతి గ్రీన్ ట్రెండ్స్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. నిన్న తాండూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరింది. ఈ ఉదయం మైలారం రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహం పడివున్నట్టు గమనించిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి ఆమెను జ్యోతిగా గుర్తించారు.

ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? లేక రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో మృతదేహం ఉండటం, మైలారం సమీపంలో సెల్ ఫోన్ దొరకడంతో పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషన్ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు మరెవరైనా ప్రయాణించారా? అన్నది పరిశీలిస్తున్నారు. కాగా, తన కుమార్తెపై అత్యాచారం జరిపి హత్య చేశారని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News