Karnataka: కర్ణాటక బీజేపీ నేత కాన్వాయ్ పై రాళ్ల దాడి

  • బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కాన్వాయ్ పై రాళ్ల దాడి
  • సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయుల పని 
  • అప్రమత్తమైన పోలీసులు 

కర్ణాటక బీజేపీ నేత కారుపై రాళ్ల దాడి జరిగింది. చిత్ర దుర్గ జిల్లాలోని మొల్కలమూర్ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీరాములుకు బీజేపీ టికెట్ కేటాయించింది. శ్రీరాములుకు టికెట్ కేటాయించడంపై మొల్కలమూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరాములు కాన్వాయ్ పై తిప్పేస్వామి వర్గీయుులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిప్పేస్వామి వర్గీయులను చెదరగొట్టారు.

కాగా, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవిని శ్రీరాములుకు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడి దళితులకు కీలకపదవులు ఇవ్వకపోవడం, వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడంపై మాదిగలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దళితులను, ‘గాలి’ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News