Chandrababu: ఏపీలో 'టీసీఎస్' కార్యకలాపాలు జరిపేందుకు సిద్ధం: చంద్రబాబుతో టాటాసన్స్‌ బోర్డు చైర్మన్ నటరాజన్‌

  • సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ఏపీలో ఐటీ రంగానికి సహకరిస్తామన్న టాటాసన్స్‌ చైర్మన్
  • బ్రిటన్ మాజీ ప్రధానితో చంద్రబాబు సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా టాటాసన్స్‌ బోర్డు చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరగా ఐటీ రంగంతో పాటు అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్బంగా చంద్రశేఖరన్ స్పష్టమైన హామీనిచ్చారని చంద్రబాబు తెలిపారు.

అలాగే బ్రిటన్ మాజీ ప్రధాని, 'టోనీ బ్లేయర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్' నిర్వాహకుడు టోనీ బ్లేయర్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టోనీ బ్లేయర్‌ మాట్లాడుతూ.. భారత్‌లో ఇప్పటికే 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తున్నామని, త్వరలో ఏపీకి వస్తామని ఈ సందర్బంగా చంద్రబాబుకి హామీ ఇచ్చారు.

Chandrababu
Andhra Pradesh
singapore
Telugudesam
  • Loading...

More Telugu News