ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారు?: వెంకయ్యనాయుడిపై తెలంగాణ నేత ఆగ్రహం
- ప్రత్యేక హోదాపై కేంద్రం మాట తప్పింది
- 16న జైల్ భరో కార్యక్రమం చేపట్టనున్నాం
- మోదీ, కేసీఆర్ లకు ప్రజా సంక్షేమం పట్టలేదు
ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న తాము జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రజా సంక్షేమం పట్టలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఇతర ప్రాజెక్టులపై చూపడం లేదని కేసీఆర్ పై మండిపడ్డారు.