KTR: యాక్సిడెంట్ కు గురైన వ్యక్తికి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్!

  • దమ్మాయిగూడలో ఓ వ్యక్తికి యాక్సిడెంట్‌
  • అదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్లిన కేటీఆర్‌
  • బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • ఈ రోజు ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్‌

ఓ వ్యక్తికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ క్షమాపణలు చెప్పారు. ఇటీవల హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడలో జితేందర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే, ఆ రోడ్డు మీదుగా కేటీఆర్ కాన్వాయ్ వెళుతోన్న నేపథ్యంలో జితేందర్‌ని ఆ మార్గం గుండా ఆసుపత్రికి తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది. అతడి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నా వారు అనుమతి ఇవ్వలేదని తెలిసింది.

దీంతో కేటీఆర్‌ వెళ్లే వరకు బాధితుడు కాలిగాయంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వార్తను ఓ యువకుడు కేటీఆర్‌కి ట్వీట్‌ చేయగా దానిపై మంత్రి స్పందించారు. ఈ విషయం నిజం కాదేమోనని తాను అనుకుంటున్నానని, తన పని తీరు ఎన్నడూ అలా ఉండదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ ఘటన నిజమైతే, తాను ఆ యువకుడికి సారీ చెబుతున్నానని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News