Jagan: పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. హైదరాబాదుకు పయనం

  • రేపు కోర్టు విచారణకు హాజరుకానున్న జగన్
  • అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ
  • గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కొనసాగుతున్న పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ బయలుదేరారు. రేపు సీబీఐ కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో, ముందుగానే ఆయన హైదరాబాదుకు పయనమయ్యారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ సీబీఐ కోర్టు విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో బీజీగా ఉన్నప్పటికీ... కోర్టు వాయిదాలకు మాత్రం ఆయన క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 

Jagan
Hyderabad
cbi court
case
padayatra
  • Loading...

More Telugu News