BJP: 1,034 కోట్లతో అత్యంత సంపన్న పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ

  • అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీగా రికార్డు నెలకొల్పిన బీజేపీ
  • ఖర్చుల్లో కూడా బీజేపీదే అగ్రస్థానమని తెలిపిన ఏడీఆర్ 
  • రెండు కోట్ల రూపాయలతో చివరి స్థానంలో సీపీఐ

1,034 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తో దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిపి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1,559 కోట్ల రూపాయలు ఆర్జించగా, అందులో 66 శాతం వాటాతో విరాళాలు, చందాల రూపంలో బీజేపీ 1,034 కోట్ల రూపాయలు ఆర్జించిందని ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

తొమ్మిది కోట్ల మందితో అత్యధిక సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీ, అత్యధిక సంపాదన కలిగిన పార్టీగా రికార్డు సృష్టించింది. దాని తరువాతి స్థానంలో 225 కోట్ల రూపాయల ఆదాయంతో కాంగ్రెస్‌ పార్టీ నిలిచింది. రెండు కోట్ల రూపాయలతో సీపీఐ అట్టడుగు స్థానంలో నిలిచిందని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఖర్చుల్లో కూడా బీజేపీదే అగ్రస్థానమని ఈ నివేదిక తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన రాజకీయ పార్టీలు 1,228 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ఒక్క బీజేపీయే 710 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఈ నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News