Maharashtra: ఖండాలా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

  • మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
  • పర్యాటక ప్రాంతం ఖండాలా మార్గంలో దారుణం
  • ప్రమాదంలో పలువురికి గాయాలు 

మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఖండాలా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్ రోడ్డుకు రక్షణగా వేసిన రెయిలింగ్‌ ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.  

  • Loading...

More Telugu News