Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కీర్తి సురేశ్ కు చిన్నప్పటి అలవాటు!
  • 'రంగస్థలం'ను వీక్షించిన పవన్
  • సూర్యను సంప్రదించలేదన్న దర్శకుడు  
  • ఫుల్ యాక్షన్ లో నాగార్జున!

*  తాను ఎవరితోనైనా సరే ఇట్టే కలసిపోతానని అంటోంది అందాలతార కీర్తి సురేశ్. 'అందరితోనూ కలసిపోవడం అన్నది నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. ఈ విషయంలో కొత్త, పాత అన్నది వుండదు. ఆ అలవాటు సినిమా రంగంలో నాకు బాగా పనికొచ్చింది' అని చెప్పింది కీర్తి.  
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, నిన్న రాత్రి ఈ చిత్రాన్ని హైదరాబాదు, ప్రసాద్ ఐ మ్యాక్స్ లో పవన్ కల్యాణ్ తన భార్యతో కలసి వీక్షించారు. చరణ్ కూడా ఈ షోకి హాజరయ్యాడు.
*  మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. మలయాళ స్టార్ మమ్ముట్టి 'వైఎస్సార్' పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ సూర్య 'జగన్' పాత్రను పోషించనున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర దర్శకుడు మహి వి. రాఘవ్ దీనిని ఖండించారు. ఇంతవరకు సూర్యను తాము సంప్రదించలేదని చెప్పారు.  
*  నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'ఆఫీసర్' చిత్రం టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా వర్మ చెబుతూ, ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.          

  • Loading...

More Telugu News