Andhra Pradesh: దేశంలో తొలిసారిగా అమరావతిలో సంతోషనగరాల సదస్సు

  • ఈ నెల 10 నుంచి 12 వరకు మంగళగిరిలో జరగనున్న సదస్సు
  •  27 దేశాల నుంచి హాజరుకానున్న వంద మంది ప్రతినిధులు
  • అమరావతిని సంతోష నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికల రూపకల్పనపై జరగనున్న చర్చ 

గుంటూరు జిల్లా మంగళగిరిలో సంతోష నగరాల సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శశిధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా అమరావతిలో సంతోషనగరాల సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ఈ నెల 10 నుంచి 12 వరకు ఈ సదస్సు నిర్వహించనుందని, భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు 27 దేశాల నుంచి 100  మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, ప్రజలు సంతోషంగా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై, అమరావతి సంతోష నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపకల్పనపై చర్చ జరగనుందని, సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసాం చేస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News