Chandrababu: రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ప్ర‌య‌త్నిస్తున్నాయి: చ‌ంద్రబాబు

  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఆలోచించ‌డం లేదు
  • అమిత్ షా వాడిన భాష ఇంత‌వ‌ర‌కు ఎవ్వ‌రూ వాడ‌లేదు
  • న‌కిలీ యూసీలు ఇచ్చామ‌ని నీచ‌మైన ప్ర‌చారానికి దిగారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ప్ర‌య‌త్నిస్తున్నాయని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న అధ్య‌క్ష‌త‌న అమ‌రావ‌తిలో అఖిల‌ప‌క్ష సంఘాల స‌మావేశం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఆలోచించ‌డం లేదని అన్నారు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా వాడిన భాష ఇంత‌వ‌ర‌కు జాతీయ స్థాయిలో ఎవ్వ‌రూ వాడ‌లేదని, అలాగే తాము న‌కిలీ యూసీలు ఇచ్చామ‌ని బీజేపీ నేత‌లు అస‌త్య‌ ప్ర‌చారానికి దిగారని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో రాష్ట్ర‌మంతా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోందని చంద్రబాబు అన్నారు. తాము పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తే అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయని, కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిందని అన్నారు.  

  • Loading...

More Telugu News