Mahesh Babu: 'భరత్ అనే నేను' ఫంక్షన్ కి ఎన్టీఆర్ మాత్రమే వస్తున్నాడట!

  • కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను'
  • రేపు రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 20న సినిమా విడుదల

కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు రాత్రి 7 గంటలకు హైదరాబాద్ -  ఎల్బీ స్టేడియంలో జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఈ సినిమా టీమ్ నిమగ్నమై వుంది.

ఈ వేడుకకు ఎన్టీఆర్ .. చరణ్ లను ముఖ్య అతిథులుగా మహేశ్ బాబు ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రమే ఈ వేడుకకి హాజరవుతున్నాడట .. చరణ్ రావడంలేదని టాక్. ఏదో ముఖ్యమైన పని కారణంగా చరణ్ రాలేకపోతున్నాడని అంటున్నారు. మెగా .. నందమూరి .. ఘట్టమనేని వారసులను ఒకే వేదికపై చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశను కలిగించేదే. ఈ సినిమాకి మొదటి నుంచి వున్న హైప్ కారణంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని సమాచారం. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా, ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.     

  • Loading...

More Telugu News