చేసిన తప్పును మరోసారి చేస్తున్న చంద్రబాబు: పవన్ కల్యాణ్
- హైదరాబాద్ విషయంలో తప్పు చేసిన చంద్రబాబు
- అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేశారు
- రాయలసీమ, కళింగ ఉద్యమాలు వచ్చే అవకాశం
- హెచ్చరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
దీంతో అభివృద్ధిలో తమకు భాగం లేకుండా పోయిందన్న భావన ప్రజల మనసుల్లో చేరిందని, ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ ఆరోపించారు. కేవలం అమరావతిని మాత్రమే చూసుకుంటే, రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించిన ఆయన, పాలకుల తప్పిదాల కారణంగానే అస్థిత్వ పోరు మొదలవుతోందని చెప్పారు. మంగళగిరి అటవీ ప్రాంతంలో 1800 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని చెప్పిన చంద్రబాబు, అన్ని వేల ఎకరాలు ఎందుకు సమీకరించారని ప్రశ్నించారు. మహానగరాలు రాత్రికి రాత్రి నిర్మితం కాలేదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలని హితవు పలికారు.