Mahesh Babu: మహేశ్ మూవీ నుంచి మరో సాంగ్ .. దుమ్ము రేపేస్తోంది!

  • 'భరత్ అనే నేను' నుంచి మూడవ పాట 
  • ఉత్తేజపరుస్తోన్న రామజోగయ్య శాస్త్రి సాహిత్యం 
  • హుషారెత్తిస్తోన్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా ముందుగా చెప్పినట్టుగానే, మూడవ పాటగా 'వచ్చాడయ్యో సామి'ని కొంతసేపటి క్రితం వదిలారు. 'వచ్చాడయ్యో సామి .. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ..', ఇచ్చాడయ్యో సామి .. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ' అంటూ ఈ పాట మొదలవుతోంది.

మహేశ్ ను ఉద్దేశిస్తూ జనం పాడుకునే పాటగా అనిపిస్తోంది. ఆ జనంలో ఒకడై మహేశ్ కూడా చిందేస్తాడనే విషయం పోస్టర్స్ ద్వారా అర్థమవుతోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది .. జనంలోకి వెళ్లేలా .. జనం నాల్కులపై ఆడేలా వుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ పాటకి మరింత ఊపును తీసుకొచ్చిందనే చెప్పాలి. కష్టంలోని సుఖాన్ని .. కలిసి బతకడంలోని ఆనందాన్ని ఆవిష్కరించేలా వున్న ఈ పాటకి నూటికి నూరు మార్కులు పడిపోతాయని చెప్పొచ్చు.

  • Loading...

More Telugu News