charan: 'రంగస్థలం' విషయంలో చిరూ చెప్పినట్టే జరిగిందట!

  • 'రంగస్థలం' విజయవిహారం 
  • నిడివి విషయంలో తర్జనభర్జనలు 
  • మంచి ఫలితాన్నిచ్చిన చిరూ సూచన

చరణ్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమా కొత్త రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు 'ఓరయ్యో .. ' అనే ఎమోషనల్ సాంగ్ వస్తుంది. ఈ సినిమా నిడివి ఎక్కవ కావడంతో ఈ సాంగ్ ను లేపేద్దామనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చారట. ఈ అభిప్రాయాన్ని వాళ్లు సుకుమార్ .. చరణ్ ల దగ్గర ప్రస్తావించారు.

ఈ విషయంలో చిరంజీవి సలహా తీసుకుందామని అంతా కలిసి ఆయనను అడిగారట. ఈ ఎమోషనల్ సాంగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనీ .. ఆ సాంగ్ కి ముందు .. వెనుక వున్న సీన్స్ ను కూడా కట్ చేయవద్దనే అభిప్రాయాన్ని చిరూ వ్యక్తం చేశారట. కావాలంటే ఆ నిడివికి తగ్గా కామెడీ సీన్స్ తొలగించమని చెప్పారట. చిరంజీవి ఉంచమని చెప్పిన ఎమోషనల్ సాంగ్ ఇప్పుడు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని అంటున్నారు. ఈ సాంగ్ ప్రతి మనసుకు రీచ్ అయిందని చెబుతున్నారు .. మెగా అనుభవం అలాంటిది మరి!     

  • Loading...

More Telugu News