amit shah: నిజాలు చెప్పినందుకు.. అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ!

  • సిల్క్ ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉందన్న అమిత్
  • మరోసారి నిజం మాట్లాడారన్న కాంగ్రెస్
  • కాంగ్రెస్ కు మీరు స్టార్ క్యాంపెయినర్ అంటూ ట్వీట్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తడబడుతున్న సంగతి తెలిసిందే. అమిత్ చేస్తున్న పొరపాట్లు కాంగ్రెస్ పాలిట మంచి ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అమిత్ షానే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశంలోనే అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం ఎడ్యూరప్పదే అని చెప్పి, ఆ తర్వాత అమిత్ షా నాలుక కరుచుకున్న సంగతి తెలిసిందే.

మరో బహిరంగసభలో ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేశారని చెప్పారు. మరో చోట ప్రసంగిస్తూ, సిల్క్ ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉందని అన్నారు. అమిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో సిల్క్ ఉత్పత్తి గరిష్ఠ స్థాయికి చేరుకుందని... ఈ విషయాన్ని అమిత్ షా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. 'మా పార్టీకి మీరు స్టార్ క్యాంపెయినర్ గా మారుతున్నారని' ట్వీట్ చేశారు.  

  • Loading...

More Telugu News