gvl: చంద్రబాబు ఇప్పటికైనా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు

  • మోసపూరిత రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి 
  • ఏపీ సర్కారు ఇచ్చిన నిధులనే సరిగ్గా వాడుకోవడం లేదు
  • ఇంకా నిధులు రాలేదని రాజకీయం చేస్తున్నారు
  • వాడిన నిధులపై జవాబుదారీతనం లేదు

ఏపీలోని పార్టీలు ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మోసపూరిత రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తున్నాయని, ఏది నిజమో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏపీ సర్కారు ఇప్పటికే సరిగ్గా వాడుకోవడం లేదని, మరోవైపు ఇంకా నిధులు రాలేదని రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు. ఓ వైపు వాడిన నిధులను గురించి ఏపీ సర్కారు దగ్గర జవాబుదారీతనం లేదని, మరోవైపు నిధులు ఇచ్చినప్పటికీ వాడుకునే సామర్థ్యం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధినే నినాదంగా చేసుకుని దేశంలో బీజేపీ దూసుకెళుతోందని అన్నారు.

చంద్రబాబు చేసే ఆరోపణల్లో ఎలాంటి నిజాలూ లేవని జీవీఎల్ నరసింహారావు అన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల్లో తాము వివక్ష చూపామని అనడం లేదని, ఏపీలోనే అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఇలాంటి భ్రమలు కలిగించే రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News