Kerala: కేరళలో దారుణం.. పెళ్లికి హాజరైన మహిళలంతా లైంగిక వేధింపుల బారినపడిన వైనం!

  • కోజికోడ్‌ జిల్లాలోని వడకర పట్టణంలోని సదయమ్‌ స్టూడియో నిర్వాకం
  • వివాహ శుభకార్యాల ఫోటోలు తీసి, అందులోని మహిళల ఫోటోల మార్ఫింగ్
  •  పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

కేరళలో దారుణం వెలుగు చూసింది. ఒక ఫొటోస్టూడియో నీచానికి దిగజారడంతో వివిధ వివాహాలకు హాజరైన మహిళలంతా లైంగిక వేధింపుల బాధితులుగా మారిన ఘటన వెలుగు చూసింది. దారుణమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కోజికోడ్‌ జిల్లాలోని వడకర పట్టణంలోని సదయమ్‌ స్టూడియోను సతీశన్, దినేశ్, బిటేశ్ నిర్వహిస్తున్నారు. ఆ పట్టణంలో వివిధ వివాహ శుభకార్యాల ఫోటోలను వీరు తీసేవారు.  ఆ వివాహాలకు హాజరైన పలువురు మహిళల ఫోటోలను అందంగా చిత్రీకరించేవారు. వివాహానంతరం వారి ఫోటోలను వారికి అందజేసిన తరువాత వీరు అసలు పని మొదలుపెట్టేవారు.

 పలువురు మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటిని ఆన్ లైన్ లో పెట్టేవారు. ఇలా తీసిన ఫోటోల్లో ఒక మహిళ తన ఫోటోను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా డొంక కదిలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సతీశన్‌, దినేశ్‌ లను అరెస్ట్‌ చేసి, పరారీలో ఉన్న బిటేశ్‌ కోసం గాలింపు చేపట్టారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. వీరి ఫోటో స్టూడియోను సీజ్ చేశారు. వీరి స్టూడియో హార్డ్ డిస్క్ లో సుమారు 40 వేల మంది మహిళల ఫొటోలు ఉన్నాయని వారు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని, పూర్తి విచారణ అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News