Pawan Kalyan: విజయవాడలో నేడు వామపక్ష నేతలతో సమావేశం కానున్న పవన్ కల్యాణ్

  • 10 గంటలకు విజయవాడ చేరుకోనున్న పవన్ కల్యాణ్
  • భావసారూప్య పార్టీలతో పోరాటానికి సిద్ధం 
  • ప్రత్యేకహోదాపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న జనసేన అధినేత   

 ప్రత్యేకహోదా ఉద్యమం జోరు పెంచడానికి ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ నడుంబిగించారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకోనున్న పవన్‌ కల్యాణ్ వామపక్ష పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. హోదాపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్, పోరాటానికి వెనుకడుగేసేది లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన భావసారూప్య పార్టీలతో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. దీంతో నేడు వామపక్ష పార్టీలతో సమావేశానంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు. 

  • Loading...

More Telugu News