assembly: ఏపీలో 80 శాతం మంది కాపులు పవన్ వైపే ఉన్నారు!: బీజేపీ నేత మాణిక్యాల‌రావు

  • క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు ఖాయం
  • పవన్ వారిని ఎలా వినియోగించుకుంటారో చూడాలి
  • మాకు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వడం లేదు

బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని టీములను కర్ణాటకకు పంపిందని, ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీ కర్ణాటకలో గెలిచితీరుతుందని బీజేపీ ఏపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల‌రావు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం మంది కాపులు పవన్ వైపే ఉన్నారని, పవన్ వారిని ఎలా వినియోగించుకుంటారో చూడాలని అన్నారు.

టీడీపీ అవినీతిపై పవన్ కల్యాణ్ మాట్లాడిన తరువాత ఆ విషయం జనంలోకి బాగా వెళ్లిందని అన్నారు. కొన్ని రోజులుగా బీజేపీపై టీడీపీ చేస్తోన్న వాదనలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు. కాగా, తమకు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వడం లేదని, తాము పలు అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News