charan: 'రంగస్థలం' హిట్ .. చైతూ ఆనందం

  • 'రంగస్థలం'తో సక్సెస్ సాధించిన మైత్రీ మూవీస్ 
  • అదే బ్యానర్లో రూపొందుతోన్న 'సవ్యసాచి'
  • 'సవ్యసాచి' పై 'రంగస్థలం' సక్సెస్ ప్రభావం  

'రంగస్థలం' సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇంతటి ఘనవిజయాన్ని సాధించడం పట్ల నాగచైతన్య హ్యాపీగా వున్నాడట. అందుకు కారణం .. సమంత నటించడం మాత్రమే కాదు, ఈ సినిమాను రూపొందించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడం కూడా.

 'రంగస్థలం' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇదే బ్యానర్లో ప్రస్తుతం చైతూ 'సవ్యసాచి' చేస్తున్నాడు. అందువలన 'రంగస్థలం' సక్సెస్ ప్రభావం ఈ సినిమాపై ఉంటుందని ఆయన భావిస్తున్నాడట. 'ప్రేమమ్' వంటి సక్సెస్ ను ఇచ్చిన చందూ మొండేటితో చేస్తోన్న సినిమా కావడం .. 'రంగస్థలం'తో హిట్ కొట్టిన బ్యానర్లో చేస్తుండటం వలన .. 'సవ్యసాచి' పై గట్టి నమ్మకంతోనే చైతూ వున్నాడని అంటున్నారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.  

  • Loading...

More Telugu News