charan: 100 కోట్ల వసూళ్లు దాటేసిన 'రంగస్థలం'

  • తెలుగు రాష్ట్రాల్లో 'రంగస్థలం' జోరు 
  • ఓవర్సీస్ లోను అదే సందడి 
  • ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లు

చరణ్ .. సమంత జంటగా నటించిన 'రంగస్థలం' క్రితం నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి 4 రోజుల్లో ఈ సినిమా 43.78 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో తొలి 4 రోజుల్లో ఈ సినిమా 2.45 మిలియన్ డాలర్లను రాబట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే తొలి 4 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను సాధించింది. 'బాహుబలి' తరువాత అంత వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ఇదేనని అంటున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికి సుకుమార్ .. చరణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాను అందించాడు. దర్శకుడిగా తన ప్రతిభా పాటవాలకు కొలమానంగా ఈ సినిమాను సెట్ చేశాడు.     

  • Loading...

More Telugu News