malala: పాకిస్థాన్‌ నుంచి తిరిగి బ్రిటన్‌కు పయనమైన మలాలా

  • 4 రోజుల పాటు పాక్‌లో పర్యటించిన మలాలా
  • తమ సొంత పట్టణంతో పాటు పలు ప్రాంతాల సందర్శన
  • తాను చదువుకున్న స్కూల్‌కి కూడా వెళ్లిన మలాలా

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తన సొంత దేశమైన పాకిస్థాన్‌కు నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె పాక్ పర్యటన ముగియడంతో మళ్లీ బ్రిటన్‌కు బయలుదేరింది. పాక్‌ పర్యటన సందర్భంగా తాను తీసుకున్న ఫొటోలను మలాలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 ఈ పర్యటన సందర్భంగా ఆమె తన సొంత పట్టణమైన స్వాత్ లోయలోని మింగోరా, తాను చదువుకున్న పాఠశాల, పాక్ పీఎంవో ఆఫీసుతో పాటు పలు ప్రాంతాలను సందర్శించింది. 2012లో తాలిబన్ ఉగ్రవాదుల దాడిలో గాయాలపాలైన తరువాత మలాలా మళ్లీ‌ పాక్‌లో అడుగు పెట్టడం ఇదే తొలిసారన్న విషయం తెలిసిందే. 

malala
Pakistan
  • Error fetching data: Network response was not ok

More Telugu News