KCR: తెలంగాణలో వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో మాట్లాడిన కేసీఆర్
  • వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి
  • నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతోన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అలాగే వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై కేసీఆర్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో మాట్లాడారు.

15 రోజులుగా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని, రాబోయే రోజుల్లో పడే వర్షాల వల్ల కలిగే నష్టాన్ని వెంట వెంటనే అంచనా వేయాలన్నారు. నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడానికి సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎస్‌కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు చేట్టాలని చెప్పారు.

కాగా, హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, యూసఫ్ గూడ ప్రాంతాలతో పాటు పలు చోట్ల వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News