mehreen: అందాల హీరోయిన్‌లను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. ఫొటోలు

  • ఏలూరుకి వచ్చిన రాశీఖన్నా, రీతూ వర్మ, మెహరీన్
  • ఘ‌న స్వాగ‌తం లభించిందన్న రాశీఖన్నా
  • అభిమానులకు హాయ్‌ చెప్పి అలరించిన అందాల భామలు

త‌మ‌కు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఘ‌న స్వాగ‌తం లభించిందని హీరోయిన్ రాశీఖన్నా తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. ఆ నగరంలోని ఆర్.ఆర్.పేటలో ఈ రోజు రాశీఖన్నాతో పాటు ఇతర హీరోయిన్లు రీతూ వర్మ, మెహరీన్ ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ముగ్గురు హీరోయిన్లు తమ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు భారీగా అక్కడికి తరలివచ్చారు.

వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ కలియదిరుగుతూ, ఆ హీరోయిన్లు షాపులోని చీరలను పరిశీలించారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ అభిమానులకు హాయ్ చెప్పి వారిని అలరించారు. అనంతరం తమ ఫొటోలను సదరు హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.        

  • Loading...

More Telugu News