Chandrababu: కేంద్ర సర్కారుపై నిరసన.. నల్ల బ్యాడ్జీలు ధరించిన ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు

  • నిరసనలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
  • విశాఖలో ప‌లు కంపెనీలను ప్రారంభించడానికి వెళ్లిన సీఎం
  • చంద్రబాబుతో పాటు సహచర మంత్రుల నిరసన

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై నల్ల బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు నల్లబ్యాడ్జీలు ధరించారు. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్‌లో ప‌లు కంపెనీల‌ను ప్రారంభించడానికి వ‌చ్చిన రాష్ట్ర‌ మంత్రులంతా న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి క‌న‌పడ్డారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... విశాఖపట్నం మంచి లాజిస్టిక్‌ హబ్‌ అని, అద్భుతమైన పర్యాటక కేంద్రమని, ఈ ప్రాంతంలో తాము అంతర్జాతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన వారిలో చంద్రబాబుతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారా లోకేశ్, ఎంపీ అవంతి శ్రీనివాస్ ఉన్నారు.

  • Loading...

More Telugu News