nithin: 'ఛల్ మోహన్ రంగ'లో పవన్ కనిపిస్తాడంటూ ప్రచారం .. సస్పెన్స్ లో పెట్టేసిన నితిన్!

  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ'
  • నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'ఛల్ మోహన్ రంగ' సినిమా రూపొందింది. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ కనిపిస్తాడనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

 తాజా ఇంటర్వ్యూలో నితిన్ దగ్గర ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. పవన్ ఈ 'సినిమాలో ఉండడు .. కానీ వున్నట్లే ఉంటుంది' అంటూ నితిన్ సస్పెన్స్ లో పెట్టేశాడు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కి నితిన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా నితిన్ సినిమాలో పవన్ ప్రస్తావన ఉంటూ ఉంటుంది. మరి ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం కోసం ఏం చేసి ఉంటారనేదే ఆసక్తికరంగా మారింది. నితిన్ .. త్రివిక్రమ్ తో పాటు పవన్ కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News