Uttar Pradesh: టీవీలో క్రైమ్ షో చూసి.. 'ఉరి ఆట' ఆడుకున్న చిన్నారులు.. బాలిక మృతి

  • ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘటన
  • బకెట్‌పై నిలబడి ఓ చున్నీని ఫ్యాన్‌కి కట్టిన చిన్నారులు
  • ప్రమాదవశాత్తు బిగుసుకు పోయిన చున్ని

టీవీలో ఓ క్రైమ్ షో చూసిన చిన్నారులు.. అచ్చం అందులో చూపినట్లుగా చున్నీని ఫ్యాన్‌కు కట్టి, ఉరి ఆట ఆడుకోవాలనుకున్నారు. చివరకు ఆ ఆటలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో తన మిత్రుల నివాసానికి వెళ్లిన ఓ బాలిక.. వారితో కలిసి టీవీలో ఓ క్రైమ్ షో చూసింది. అనంతరం ఆ షోలో చేసినట్లుగానే ఆడుకోవాలనుకున్నారు.

అందులో భాగంగా బకెట్‌పై నిలబడి ఓ చున్నీతో ఫ్యాన్‌కి కట్టారు. ఎనిమిదేళ్ల సదరు బాలిక ఆ చున్నీకి ఉరేసుకున్నట్లు నటించింది. అయితే, ప్రమాదవశాత్తు ఆ చున్నీ నిజంగానే బిగుసుకుపోవడంతో ఆమె మృతి చెందింది. దీంతో భయపడిపోయిన మిగతా చిన్నారులు మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కొద్దిసేపటి తరువాత ఓ బాలుడు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News