keerti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రవితేజతో జత కట్టనున్న కీర్తి సురేష్ 
  • సోదరులుగా రానున్న ఎన్టీఆర్, చరణ్ 
  • కోల్ కతా లో '2 స్టేట్స్' షూటింగ్ 
  • నిర్మాతగా మారుతున్న మరో దర్శకుడు


*  అందాలతార కీర్తి సురేష్ త్వరలో రవితేజ సరసన నాయికగా నటించనుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రంలో ఓ కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంచుకున్నట్టు సమాచారం.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్, చరణ్ సోదరులుగా నటించనున్నట్టు తాజా సమాచారం.
*  రాజశేఖర్ తనయ శివాని నాయికగా పరిచయమవుతున్న '2 స్టేట్స్' తెలుగు రీమేక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి విదితమే. అడవి శేష్ హీరోగా వెంకట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూలును త్వరలో కోల్ కతాలో నిర్వహించనున్నారు. ఇందులో శివాని బెంగాలీ బ్రాహ్మిన్ అమ్మాయిగా కనిపిస్తుంది.
*  యువ దర్శకుడు బాబీ త్వరలో నిర్మాతగా మారనున్నాడు. ఈ చిత్రానికి అరుణ్ పవార్ ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.   

  • Loading...

More Telugu News