Chandrababu: తొలిరోజు నుంచే పోరాడితే నేను కాస్త ఓపిక పడితే బాగుండేదని విమర్శించేవారు!: చంద్రబాబు

  • నాలుగేళ్ల‌య్యాక అడిగితేనే కేంద్ర సర్కారు ఇంత నిర్లక్ష్యంగా ఉంది
  • తొలిరోజు నుంచి దూకుడుగా వెళ్లి ఉంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జ‌రిగేది 
  • దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అన్యాయం చేశార‌ని నన్ను అనేవారు

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ నాలుగేళ్ల తరువాత టీడీపీ పోరాడుతోంద‌ని కొందరు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండడంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఒకవేళ‌ తొలిరోజు నుంచే పోరాడితే తాను కాస్త ఓపికగా ఉంటే బాగుండేదని విమర్శించేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నాలుగేళ్ల‌య్యాక అడిగితేనే కేంద్ర స‌ర్కారు ఇంత నిర్ల‌క్ష్యంగా వెళుతోంద‌ని, తొలిరోజు నుంచి దూకుడుగా వెళ్లి ఉంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జ‌రిగేదని అన్నారు. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అన్యాయం చేశార‌ని అనేవారని, మొద‌టి నుంచి ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలో అంత జాగ్ర‌త్త‌గా ఉన్నామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News